ఆగస్టు 15న కరోనా నుంచి స్వాతంత్ర్యం పొందుతామని దేశ ప్రజలు ప్రతిజ్ఞ చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రజలను ఉద్దేశించి మన్కీ బాత్లో మోదీ ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా త్వరలో జరగనున్న రాఖీ పండుగ, స్వాతంత్ర్య దినోత్సవాల గురించి ప్రస్తావించారు. కొన్ని రోజుల్లో రక్షాబంధన్ రానుంది. ఈ సారి ఈ పండుగను వైవిధ్యంగా జరుపుకోవాలని సూచించారు.
ఈ సారి ఆగస్టు 15 కూడా భిన్నమైన పరిస్థితులలో జరుపుకుంటున్నాం. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో స్వాతంత్ర్య దినోత్సవం జరుగుతుంది. ఈ మహమ్మారి నుండి స్వాతంత్ర్యం పొందుతామని స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రతిజ్ఞ చేయాలని నేను దేశ ప్రజలను కోరుతున్నానని మోదీ అన్నారు.