కరోనా వైరస్ ను నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంకీలక నిర్ణయంతీసుకొంది. లాక్ డౌన్ ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల భద్రతకు సంబంధించి యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ ను పకడ్బంధీగా అమలుచేసేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. పోలీసులపై ఎవరైనా దాడి చేస్తే… అలాంటి వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలను జారీ చేసింది. పోలీసులపై దాడి చేసే వారిపై జాతీయ భద్రత చట్టం కింద కేసులను నమోదు చేయాలని ఆదేశించింది.
కశ్మీర్ అమ్మాయిలకు లైన్ క్లియర్.. హరియాన సీఎం అనుచిత వ్యాఖ్యలు