telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సీబీఐ పిటిషన్‌పై సీఎం సమాధానం చెప్పాలి: దేవినేని

uma devineni

వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మరోసారి విరుచుకుపడ్డారు. సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై.. రాష్ట్ర ప్రజలకు సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చదువుకున్న వాళ్ల చేత ప్రభుత్వం మద్యం అమ్మిస్తోందని విమర్శించారు. నందిగామలో టీడీపీ నేతల మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలోని పలు గ్రామాల్లో నిరంతర విద్యుత్ కోత ఏర్పడిందని చెప్పారు. భారీగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా పట్టించుకునేవారులేరన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలలో 90 శాతం ఉద్యోగాలు.. మనవాళ్ళకే ఇచ్చామని విజయసాయి చెబుతున్నారని గుర్తుచేశారు.

Related posts