కైరోలోని భారత రాయబార కార్యాలయం ఈజిప్టులోని ఐన్ సోఖ్నా సమీపంలో 16 మంది భారత పర్యాటకులు బస్సు ప్రమాదానికి గురయ్యారని తెలిపింది. పర్యాటకులతో వెళుతున్న బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో 22మంది మృతి చెందారని తెలిపింది. పలువురు గాయపడగా…క్షతగాత్రులను సమీప ఆసుపత్రులలో చేర్పించారని తెలిపింది. ఎంబసీ అధికారులు… సూయెజ్, కైరో ఆసుపత్రులలో సంఘటనను పర్యవేక్షిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి.
పర్యాటకుల సమాచారం కొరకు రెండు హెల్ప్లైన్ నంబర్లను ఇచ్చారు. హెల్ప్లైన్ నంబర్లు + 20-1211299905, +201283487779 అందుబాటులో ఉన్నాయని భారత రాయబార కార్యాలయం, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేరిట ట్వీట్ చేశారు.