వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ జరిగే సౌతాంప్టన్లో వర్షం భారీగా కురుస్తుండటంతో తొలి రోజు ఆట రద్దు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు. దాంతో ఎంతగానో ఎదురు చూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. అయితే ఈ మెగా ఫైనల్ బరిలో దిగే భారత తుది జట్టును గురువారం రాత్రే ప్రకటించారు. జట్టులో పెద్ద మార్పులు ఏమి లేకపోయినా.. హైదరాబాద్ గల్లీ భాయ్ మహమ్మద్ సిరాజ్కు మొండి చెయ్యే ఎదురైంది. అతనికి బదులు సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకు టీమ్మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చింది. సిరాజ్ మంచి ఫామ్లో ఉన్నా.. స్వింగ్ చేయగల సత్తా ఉన్నా.. టీమ్మేనేజ్మెంట్ ఇషాంత్ అనుభవానికి ఓటేసింది. అయితే సిరాజ్కు చోటివ్వకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచి స్వింగ్ బౌలర్ అయిన సిరాజ్ను పక్కనపెట్టడం బాలేదని, పైగా అతను అద్భుత ఫామ్లో ఉన్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. సిరాజ్ను తీసుకుంటానని చెప్పిన విరాట్ చివరకు మాట తప్పాడని మండిపడుతున్నారు. వాస్తవానికి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే ముందు జరిగిన మీడియా సమావేశంలో టీమ్ ప్లాన్స్ గురించి విరాట్, శాస్త్రి మాట్లాడుకున్న మాటలు లీకయ్యాయి. అప్పటికి లైవ్ ఇంకా స్టార్ట్ కాలేదని భావించిన కోహ్లీ.. న్యూజిలాండ్ లెప్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లను ఎలా కట్టడి చేయాలి..? అనే వ్యూహంపై రవిశాస్త్రితో చర్చించాడు. ఈ క్రమంలో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్లను రౌండ్ ద వికెట్ బౌలింగ్ చేయించడం ద్వారా కట్టడి చేయబోతున్నట్లు కోహ్లీ వెల్లడించగా.. రవిశాస్త్రి అందుకు అంగీకారం తెలిపాడు. ఈ మాటలు లైవ్లో వచ్చేశాయి. దాంతో సిరాజ్ తుది జట్టులో ఉండటం ఖాయమని అంతా భావించారు.
next post