telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం

cm jagan on govt school standardization

ఏపీ అసెంబ్లీలో పలు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దేశ చరిత్రలో తొలిసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పదవులు..సర్వీసుల్లో 50శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని సీఎం జగన్‌ అన్నారు. ఇందులో 50శాతం మహిళలకు కేటాయించామన్నారు. పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా అసెంబ్లీలో బిల్లులు పెట్టామని చెప్పారు.ఈ బిల్లులు ప్రతిపాదించే సమయంలో టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టడం పై జగన్ మండిపడ్డారు.

బడుగు, బలహీన వర్గాలకు మేలు చేసే ఈ బిల్లులను అడ్డుకోవడం కరెక్టు కాదని అన్నారు. ఇంతటి కీలకమైన బిల్లులకు ఆమోదం తెలపాల్సింది పోయి అడ్డుకుంటారా? అని జగన్ టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చారిత్రాత్మక బిల్లులకు అడ్డుపడుతున్న ప్రతిపక్ష సభ్యులను దేవుడు శిక్షిస్తాడని జగన్ పేర్కొన్నారు. మరోవైపు స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళి టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.

Related posts