ప్రపంచకప్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మిగిలింది మూడే మ్యాచ్లు సెమీ ఫైనల్స్, ఫైనల్స్. ఇండియా-న్యూజిలాండ్ మధ్య మంగళవారం (రేపు) తొలి సెమీఫైనల్ జరగనుంది. గురువారం జరిగే మరో సెమీఫైనల్లో ఇంగ్లండ్-ఆస్ట్రేలియాలు తలపడతాయి. ఈ నెల 14న లార్డ్స్లో ట్రోఫీ కోసం జరిగే గేమ్ లో ప్రపంచకప్ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ను కొట్టుకెళ్లే జట్టు ఏదన్న విషయం చర్చనీయాంశంగా మారింది. బరిలో ఉన్న జట్లు అన్నీ బలంగానే ఉండడంతో గెలుపోటములపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఫైనల్స్లో తలపడే జట్లు ఏవో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్స్ జోస్యం చెప్పాడు. రేపటి మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తుందని తేల్చేశాడు. అలాగే, రెండో సెమీస్లో ఇంగ్లండ్ గెలిచి ఫైనల్స్కు చేరుకుంటుందని పేర్కొన్నాడు. ఈ నెల 14న జరిగే పైనల్స్లో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడతాయని కెవిన్ స్పష్టం చేశాడు.