కోవిడ్-19 (కరోనా) వైరస్ ఇప్పటివరకూ మొత్తం 64 దేశాలకు విస్తరించిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) తన నివేదికలో తెలిపింది. రోజురోజుకూ వైరస్ భాదితుల సంఖ్య పెరుగుతోందని, ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితని అభిప్రాయపడింది.కేవలం ఒకే ఒక్క రోజులో చైనా మినహా మిగతా దేశాల్లో 1,500 మందికి వైరస్ సోకిందని వెలువరించింది.
మిగతా దేశాల్లో మరణించిన వారి సంఖ్య 24 నుంచి 128కి పెరిగిందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఇప్పటివరకూ మొత్తం 64 దేశాలకు వైరస్ విస్తరించిందని, ఈ దేశాల్లో 8,774 మందికి వైరస్ పాజిటివ్ వచ్చిందని పేర్కొంది. ఈ దేశాల్లోని వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చింది. ముఖ్యంగా గుండె జబ్బులతో పాటు షుగర్, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారికి ఈ వైరస్ సులువుగా సోకుతుందన తెలిపింది.