అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో మాజీ మంత్రి పరిటాల రవి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు చంద్రబాబు సహా టీడీపీ నేతలు, యనమల, అచ్చెన్నాయుడు, రామానాయుడు, దేవినేని ఉమ, కనకమేడల రవీంద్ర కుమార్, కొల్లు రవీంద్ర, జవహర్ తదితర నేతలు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పరిటాల రవి మంచి ఆశయాలకోసం జీవితాంతం పోరాడని పేర్కొన్నారు. ప్యూడల్ పాలనపై పోరాటమే పరిటాల రవికి అందించే నివాళి అని చంద్రబాబు చెప్పారు. ఒక శక్తిగా ఒక వ్యవస్థను, పెత్తందారీ విధానాన్ని నిరసించారన్నారు. ఆయన చనిపోయి పదిహేనేళ్లయినా పేదల గుండెల్లో చిరంజీవిగా ఉన్నాడని కొనియాడారు.
చంద్రబాబు నివాసంపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు