ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ పై చైనా వైరాలజిస్ట్ లి మెంగ్ యాన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వూహాన్ ల్యాబ్లోనే పుట్టిందంని పేర్కొంటూ కొవిడ్-19 వ్యాప్తి గురించి చైనా సర్కారుకు ముందే తెలుసన్నారు. ఈ సమాచారాన్ని కప్పిపుచ్చడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఎన్నో ప్రయత్నాలు చేసిందని చెప్పింది.
చైనాపై నిందపడకుండా చేయాలనుకుందని ఆమె ఆరోపించింది. తాను చెబుతోన్న ఈ విషయాలను నిరూపించడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పింది. తాను ఈ విషయాలను చెబుతుండడంతో చైనా సర్కారు తనను సోషల్ మీడియా ద్వారా బెదిరించాలని చూస్తోందని ఆమె తెలిపింది. తన కుటుంబాన్ని కూడా భయపెడుతోందని చెప్పింది. కరోనా వైరస్ ఫుడ్ మార్కెట్ నుంచి రాలేదని, ల్యాబ్ నుంచే వచ్చిందని ఆమె మరోసారి స్పష్టం చేసింది.
బీజేపీకి టీఆర్ఎస్ చాలాసార్లు మద్దతు: ఉత్తమ్