telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

చంద్రబాబు చేస్తున్న విషప్రచార ప్రభావం ప్రజలపై పడుతోంది…

sajjala

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన కోవిడ్ పై చేస్తున్న విషప్రచారం ప్రభావం ప్రజలపై పడుతోంది. ఈయన చేస్తున్న ప్రచారం ప్రభావం ఇతర రాష్ట్రాలపై కూడా పడింది. ఢిల్లీ, ఒరిస్సా రాష్ట్రాలు మన రాష్ట్రం నుంచి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి అంటూ ప్రకటించాయి. దీనికి కారణం ఈ పెద్దమనిషి కొత్త వేరియంట్ అంటూ చేసిన ప్రచారమే కారణం. కర్నూల్ లో N440K కనిపించిందని చంద్రబాబు చెప్పుకొచ్చాడు. నీ సబ్జెక్ట్ కాదు శాస్త్రవేత్తలు చూసుకుంటారు అని చెప్పినా పేద చెవిన పెట్టారు. తనకు అవగాహన లేని విషయంపై దూకుడుగా చేస్తున్న విషప్రచారం అని పేర్కొన్నారు. ఫలితంగా మన వాళ్ళని 14 రోజులు పరిశీలనలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఢిల్లీలోనే అధికంగా కేసులు ఉన్నాయి… వస్తే అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. రాజకీయాలకు, నిందలకు ఇది సమయం కాదు. CCMB ఈ విషయాన్ని తిరస్కరించింది..ఈయన దుష్ప్రచారానికి వాళ్ళు కూడా తట్టుకోలేకపోతున్నారు. చంద్రబాబు నిర్వాకం వల్ల దానికి ఏపీ స్ట్రెయిన్ అని పేరు కూడా పెట్టారు అని అన్నారు.

Related posts