telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీ కరోనా అప్డేట్.. ఈరోజు ఎన్నంటే..?

ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ, తగ్గుతూ ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూనే వున్నాయి. కానీ ఈ రోజు మాత్రం చాలా తక్కువ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే రాష్ట్రంలో 8.64 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. అందులో ఏపీలో కొత్తగా 831 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,64,674 కి చేరింది. ఇందులో 8,45,039 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 12,673 కేసులు ఇంకా యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 6 మందిమృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 6,962 కి చేరింది. అలానే జిల్లా వారీగా చూస్తే అనంతపురంలో 34, చిత్తూరు 74, తూర్పుగోదావరి జిల్లాలో 126, గుంటూరు 90, కడపలో 37, కృష్ణాలో 145, కర్నూలులో 28, నెల్లూరు 51, ప్రకాశంలో 12, శ్రీకాకుళంలో 23, విశాఖపట్నంలో 58, విజయనగరంలో 18, పశ్చిమ గోదావరిలో 135 కేసులు నమోదయ్యాయి.

Related posts