కూలీలను గమ్య స్థానాలకు చేర్చే బాధ్యత కేంద్రమే తీసుకోవాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. వాళ్లు వెళ్లేందుకు కేంద్రం రైళ్లను ఏర్పాటు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. లాక్ డౌన్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు వారి సొంతూళ్లకు వెళ్లేందుకు కేంద్రం అనుమతించింది.
ఈ నేపథ్యంలో మంత్రి తలసాని మాట్లాడుతూ కేవలం సడలింపుల ప్రకటన చేసి, చేతులు దులుపుకోవడం సరికాదని విమర్శించారు. వలస కార్మికులు వాళ్ల ఊళ్లకు ఎలా వెళ్లగలరని ప్రశ్నించారు. దీనిపై ప్రధాని మోదీ స్పందించాలని, రాష్ట్రాలే బస్సుల్లో తరలించుకోవాలని చెప్పడం సరికాదని అభిప్రాయపడ్డారు.
40 రోజుల తర్వాత రీపోలింగ్ ప్రజాస్వామ్య విరుద్దం: లోకేష్