telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చెవిరెడ్డి సెక్రటరీగా ఎల్వీ సుబ్రహ్మణ్యం: అనురాధ

Panchumarthi-Anuradha

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రస్తుతం చెవిరెడ్డి సెక్రటరీగా మారిపోయారని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ ఆరోపించారు. అమరావతి టీడీపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైసీపీ నేత చెవిరెడ్డి అనుచరులు నిన్న షిర్డీకి వెళ్లే రైలులో మద్యం సేవిస్తూ సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. తోటి ప్రయాణీకులు భయపడేలా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సాధారణంగా రైల్వే బోగీలో సిగరెట్ కాలిస్తేనే రూ.500 జరిమానా విధిస్తారనీ, మరి వైసీపీ నేతలకు ఎన్ని లక్షల జరిమానా విధించాలని ప్రశ్నించారు.చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలన్న చెవిరెడ్డి ఫిర్యాదును సీఎస్ ఈసీకి పంపడంపై అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా ఎన్నికలు రెండు విడతల్లో జరుగుతాయి. కానీ రీపోలింగ్ రెండు సార్లు జరగడం ఎప్పుడైనా ఎన్నికల్లో చూశామా అని దుయ్యబట్టారు. మహాత్మాగాంధీని చంపిన గాడ్సే దేశభక్తుడని బీజేపీ భోపాల్ లోక్ సభ అభ్యర్థి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యాళ్ను ఆమె తప్పుపట్టారు.

Related posts