కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులకు పార్లమెంటు ఉభయసభలు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీలు చేస్తున్న నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ బిల్లులకు ఏపీలోని వైసీపీ సర్కార్ పూర్తి మద్దతు ప్రకటించింది. తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం వ్యతిరేకిస్తోంది.
ఈ బిల్లుల వల్ల రైతులకు తీరని నష్టం వాటిల్లుతుందని టీఆర్ఎస్ వాదిస్తోంది. ఈ క్రమంలో ఈ బిల్లులను వ్వతిరేకిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఈరోజు ప్లకార్డులు చేతపట్టి నిరసన వ్యక్తం చేశారు. రైతాంగాన్నికాపాడాలని ఇతర విపక్ష సభ్యులతో కలిసి టీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి కాంగ్రెస్ కీలక నేత అహ్మద్ పటేల్ నిరసన వ్యక్తం చేశారు . మరోవైపు, ఈ బిల్లుల వల్ల రైతులకు ఇప్పటి వరకు జరగని మేలు జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి .. తన దగ్గర ఓ మెడిసిన్ ఉంది: జగ్గారెడ్డి