ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. మీ శల్యసారథ్యం ఇప్పటికే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని అన్నారు. తమ అధినేత చంద్రబాబు అనుక్షణం సెక్యులరిజాన్ని అనుసరించారని తెలిపారు.
దివంగత ప్రధాని వాజ్ పేయితో కలిసినా, ఆ తర్వాత బీజేపీతో ఉన్నా సెక్యులరిజాన్ని అనుసరించారని అన్నారు. ప్రభుత్వానికి మీరు ఇస్తున్న సలహాలన్నీ కాళ్ల బేరం దగ్గరే ఆగిపోయాయని ఎద్దేవా చేశారు. మీ మాదిరి చంద్రబాబు ఎప్పుడూ అవినీతి చొక్కా తొడగలేదని అన్నారు.
సీఎం జగన్ గురించి ప్రస్తావిస్తూ తిరుమల బ్రహ్మోత్సవాలకు మీ రాక రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిందని అన్నృ. ఈ నేపథ్యంలో మతసామరస్యాన్ని దృష్టిలో పెట్టుకుని డిక్లరేషన్ పై మీరు ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మనది సెక్యులర్ రాష్ట్రమన్నారు. హైందవ ధర్మానికి గౌరవం ఇవ్వాలని కోరారు.