telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

ఐపీఎల్ జరుగుతుంది.. ప్రేక్షకులు ఉండరు: అనిల్ కుంబ్లే

Anil kumble cricketer

కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఈవెంట్లు నిలిచిపోయాయి. ఏ స్థాయి క్రికెట్ మ్యాచులు కూడా ఎక్కడా జరగడం లేదు. ఐసీసీ మేజర్ ఈవెంట్స్ తో పాటు, ఐపీఎల్ పై కూడా నీలి మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ వాయిదా పడింది. ఈ ఏడాది జరుగుతుందా? లేదా? అనే సందేహం సర్వత్ర నెలకొంది.

ఇక ఈ ఏడాది అక్టోబర్ లో ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే స్పందించారు. ఐపీఎల్ కచ్చితంగా జరుగుతుందన్న నమ్మకం తనకుందని చెప్పారు. అయితే ఐపీఎల్ మ్యాచ్ కు స్టేడియంలలో మాత్రం ప్రేక్షకులు ఉండరని కుంబ్లే పేర్కొన్నారు.

Related posts