లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో హైద్రాబాద్ నగరంలో వలస కూలీలు ఆందోళనకు దిగారు. తమను సొంతూళ్లను పంపించాని డిమాండ్ చేస్తూ సుమారు వెయ్యిమంది వలస కార్మికులు టోలీ చౌకీ రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
లాక్డౌన్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు వాపోయారు. రవాణా సౌకర్యాలు కల్పించి తమను సొంత ప్రాంతాలకు తరలించాలని ఆందోళనకు దిగారు. దాంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పారు. పైఅధికారులకు, ప్రభుత్వానికి వారి వినతిని తెలిజేస్తామనిచెప్పడంతో కార్మికులు అక్కడ నుంచి వెనుదిరిగారు.
ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కుటుంబం కన్ను: ఎంపీ కోమటిరెడ్డి