telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హుజురాబాద్ అభివృద్ధికి 35 కోట్లు విడుదల

టీఆర్ఎస్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హుజురాబాద్ పట్టణ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం 35 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. పట్టణ ప్రజల తాగునీటి కోసం 10 కోట్ల 52 లక్షలు, వార్డు అభివృద్ధి కోసం 25 కోట్లు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పట్టణంలో 35 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. 45 రోజుల్లో ఈ పనులను పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ పనులను చేయడానికి ప్రత్యేక అధికారులను నియమించాలని గంగుల కమలాకర్ తెలిపారు.

Related posts