telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఎంపీ రఘురామకృష్ణరాజు కేసులో మరో ట్విస్ట్

Raghuramakrishnaraju ycp mp

గుంటూరు : ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఈనెల 25వ తేదీ వరకూ జుడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ గుంటూరు సిఐడి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత నెల 28న ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఇద్దరు పూచీకత్తు సమర్పించారు. జూన్ 10వరకూ ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ పై సంతకాలు పెట్టలేదు. ఈ కారణంగా బెయిల్ బాండ్, షూరిటీలను రఘురామకృష్ణరాజు సంతకాలు లేకుండానే కోర్టుకు తిప్పిపంపారు జైలు అధికారులు. ఎంపీ సంతకాలు తీసుకోవడంలో జైలు అధికారులు విఫలమయ్యారన్న సీఐడీ కోర్టు… ఎంపీ జుడీషియల్ కస్టడీ నుంచి రిలీజ్ కాలేదని భావించాల్సి వస్తుందని పేర్కొంది సిఐడి కోర్టు. రఘురామకృష్ణరాజు సంతకాలు చేయకపోవడంతో రిమాండ్ వారెంట్ జిల్లా జైలు వద్ద పెండింగ్ ఉందని పేర్కొన్న సీఐడీ కోర్టు… ఈ కారణంగా ఈ నెల 25 వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించారు.

Related posts