telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తుదిదశలో ప్రభాస్‌ “రాధే శ్యామ్‌” షూటింగ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని రొమాంటిక్ ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఈ భారీ చిత్రం షూటింగ్ అంతిమ దశలో ఉంది. ఇటీవలే ఇటలీలో షూటింగ్ కు గాను అక్కడకు వెళ్లి కీలక షెడ్యూల్ ను ప్లాన్ చేసారు. ఇక అక్కడ నుంచే చిత్ర యూనిట్ పలు ఆసక్తికర అప్డేట్స్ ను కూడా వదిలారు. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం రాధే శ్యామ్ టీం అక్కడ షూటింగ్ ను ముగించే పనిలో ఉన్నారని తెలుస్తుంది. ఈ వచ్చే అక్టోబర్ 31న భారత్ కు తిరుగు ప్రయాణం కానున్నట్టు టాక్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వరుసగా విడుదలవుతున్న “రాధేశ్యామ్”‌ మోషన్‌ పోస్టర్లు, ఫోటోలు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ అంటూ విడుదల చేసిన మోషన్ పోస్టర్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. అయితే.. తాజాగా ఈ సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్‌ నాగ్‌ అశ్విన్‌ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ తో ఆదిపురుష్‌ సినిమాలో నటిస్తున్నాడు. వీటిలో ఆదిపురుష్‌ 2022 ఆగస్టు 11న విడుదల చేయనున్నారు.

Related posts