telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు పై పోటీ చేసిన .. వైసీపీ నేత చంద్రమౌళి మృతి

ycpchandramouli ycp kuppam

చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. చంద్రమౌళి మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి సంతాపాన్ని ప్రకటించారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని తెలిపారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన టీడీపీ అధినేత చంద్రబాబుపై చంద్రమౌళి పోటీ చేశారు. ఎన్నికలకు ముందే అనారోగ్యానికి గరైన ఆయన, ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆయన తరపున వైసీపీ నాయకులే నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో చంద్రమౌళిపై చంద్రబాబు 30 వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు.

Related posts