telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

దేశాన్ని కాపాడింది మోడీనే…

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన.. మీడియాతో మాట్లాడారు.  గతంలో ఉన్న కష్టాలు తొలగి పోయి అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని.. నిస్వార్థంగా సమాజ సేవ కోసం పని చేద్దామని…శక్తి వంతమైన దేశ నిర్మాణానికి పాటు పడుదామని ప్రజలకు పిలుపు ఇచ్చారు.  కరోనా మహమ్మారి నుండి దేశాన్ని కాపాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి మోడీ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏమి చేస్తే బాగుంటుందో ఆలోచించి ముందుకు వెళదామని… కుట్రలు, కుతంత్రాలు పక్కన పెడదామని తెలిపారు. అటు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. గతేడాది మనకి చీకటి సంవత్సరం.. కరోనాతో కోట్లాది కుటుంబాలు ఇబ్బంది పడ్డాయన్నారు.  ఈ ప్లవ నామ సంవత్సరం లో కరోనాను ఓడించి మానవాళిని గెలిపించాలని.. మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని తెలిపారు. అయితే ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో ప్రక్కలు ఆందోళనకు గురవుతున్నారు.

Related posts