గత ఏడాది దీపావళికి విడుదలైన కార్తీ ఖైదీ తెలుగులో ఎంతటి ఘనవిజయం అందుకుందో తెలిసిందే. ఈ మధ్య దక్షిణాది పరిశ్రమల సినిమాలపై బాలీవుడ్ నిర్మాతలు ఆసక్తిచూపుతున్నారు. అందుకే ఈ రీమేక్ సినిమాలో స్టార్హీరోనే ఉంచాలని భావించి అజయ్ దేవగన్ను సంప్రదించగా ఆయన ఈచిత్రం చూసి వెంటనే డేట్స్ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఈసినిమా షూటింగ్ వాయిదా పడింది. తాజా బాలీవుడ్ సమాచారం ప్రకారం.. అక్టోబర్ మొదటివారం నుంచి ఈ రీమేక్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయాలని యూనిట్ భావిస్తోంది. హీరోపై, మాస్ ఎలిమెంట్స్, ఫాదర్ డాటర్ ఎమోషన్ పై నడిచే ఈసినిమా కథ హిందీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిసుతందని భావించిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ ఈచిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ఉండదు కానీ హిందీ లో హీరోయిన్ పాత్రను జత చేయనున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ గా అజయ్ దేవగన్ సతీమణి , హీరోయిన్ కాజోల్ నటిస్తుందని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. కాజోల్ అజయ్ దేవగన్ ల కాంబోకు ఖచ్చితంగా మంచి మార్కులు పడుతాయనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు మేకర్స్. ఏకధాటిగా షూటింగ్ జరిపి సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ చూస్తున్నారట.