హింసాత్మక ఘటనలను ఉపేక్షించేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో పోలీసులు వెళ్తున్న వాహనాన్ని ఐఈడీతో మావోయిస్టులు పేల్చివేయడంతో 15 మంది పోలీసులు, ఒక డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను మోదీ తీవ్రంగా ఖండించారు.
పోలీసుల ధైర్యసాహసాలకు తాను సెల్యూట్ చేస్తున్నాను. వారి త్యాగాలను ఎప్పటికీ మరిచిపోదు అని మోదీ పేర్కొన్నారు. పోలీసు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలీసుల వాహనంపై మావోయిస్టులు దాడి చేయడాన్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.