చైనా నుండి వచ్చిన కరోనా మన దేశంలో దాదాపు ఏడాదికి పైగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది . అయితే ఆ మధ్య కేసులు కాస్త తగ్గుముఖం పట్టిన ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నాయి. పేద, ధనిక అనే తేడాలు లేకుండా ఈ వైరస్ అందరికి సోకుతోంది. రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు, క్రీడారంగంలోనూ ఈ వైరస్ ప్రభావం కనిపిస్తోంది. ఇక తాజాగా ఇండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కరోనా బారీన పడ్డాడు. ఈ విషయాన్ని ట్విట్టర్లో ప్రకటించారు ఇర్ఫాన్. ‘తేలిక లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకోగా.. కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. అంతకుముందే నేను స్వీయ నిర్బంధంలోకి వెళ్లాను. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఇటీవల నన్ను కలిసిన వారంతా త్వరగా పరీక్షలు చేయించుకోవాలి’అని ఇర్ఫాన్ పఠాన్ విజ్ఞప్తి చేశాడు. కాగా… ఇప్పటికే సచిన్, యూసుఫ్ పఠాన్, బద్రీనాథ్కు కరోనా సోకిన విషయం తెలిసిందే.
previous post