telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నిజామాబాద్ జవాన్ కు రూ.50 లక్షలు ప్రకటించిన సీఎం కెసిఆర్

Kcr telangana cm

సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన జవాన్ మహేశ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన యోధుడిగా మహేశ్ చరిత్రలో నిలిచిపోతారని కేసీఆర్ కొనియాడారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. జవాన్ కుటుంబానికి ప్రభుత్వం పరంగా రూ. 50లక్షల ఆర్థిక సాహాయం అందించనున్నట్లు వెల్లడించారు. అర్హతను బట్టి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. మహేశ్ కుటుంబానికి ఇంటి స్థలం కూడా కేటాయస్తామని వెల్లడించారు. కాగా..నేడు స్వగ్రామానికి వీర జవాన్ రాడ్య మహేష్ పార్థివ దేహం రానుంది. మధ్యాహ్నం 1.30 నిమి కి బేగంపేట ఎయిర్పోర్ట్ లో పార్థివ దేహాన్ని రీసివ్ చేసుకోనున్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి..నేడు సాయంత్రం లేదా రేపు ఉదయం మహేష్ స్వగ్రామం లో అంత్య క్రియలు జరగనున్నాయి. సైనిక లాంఛనాలతో వీర జవాన్ మహేష్ అంత్య క్రియలు నిర్వహించనున్నారు. 

Related posts