సౌత్ భామలు వరుసగా మాల్దీవుల బాట పట్టారు. కాజల్ అగర్వాల్ ఇటీవల భర్త గౌతమ్తో కలిసి హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ వారు తీసుకున్న పోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే.. తాజాగా మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా మాల్దీవులో దర్శనమిచ్చింది. కానీ రకుల్ సింగిల్ గానే అక్కడికి వెళ్లిపోయింది. అక్కడ సముద్రపు ఒడ్డున చల్లటి గాలి ఆస్వాదిస్తూ రచ్చ లేపుతోవది. ఇటీవల సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో రకుల్ తనలోని గ్లామర్ను బయటపెట్టేందుకు ఈ ఫోటోలు వదిలినట్టుగా అనిపిస్తోంది. సముద్రపు ఒడ్డున రిసార్టులో బికినీ లో సేద తీరుతున్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. దీంతో ఆ ఫోటోలు కాస్త… ఇప్పుడు వైరల్ అయ్యాయి. కాగా.. రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదురుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ దర్యాప్తునకు కూడా రకుల్ హాజరైంది.
previous post