telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

మొదటి టెస్ట్ లో మాత్రమే కోహ్లీ ఆడుతాడు : బీసీసీఐ

kohli double century on south africa in

యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2020 ఈ రోజుతో ముగుస్తుంది. ఈ లీగ్ ముగిసిన వెంటనే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈ టూర్ కు వెళ్లే భారత జట్లను బీసీసీఐ ఇంతకముందే ప్రకటించింది. కానీ తాజాగా నిన్న ఆటగాళ్ల గాయాల కారణంగా అందులో స్వల్ప మార్పులు చేసి జట్లను మళ్ళీ విడుదల చేసింది. ఈ సమయంలోనే ఓ షాకింగ్ విషయాని బయటపెట్టింది బీసీసీఐ. అదేంటంటే భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ పర్యటనలో ఆడాల్సిన 4 టెస్ట్ మ్యాచ్ లలో కేవలం డిసెంబర్ 17-21 వరకు అడిలైడ్‌ లో జరిగే మొదటి టెస్టుకు మాత్రమే అందుబాటులో ఉంటాడు అని తెలిపింది. ఎందుకంటే.. ప్రస్తుతం కోహ్లీ భార్య అనుష్క శర్మ ప్రెగ్నెంట్. వారు జనవరిలో తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఇంతకముందే ప్రకటించారు. అయితే ఈ టెస్ట్ సిరీస్ జనవరి 19 తో ముగుస్తుంది. కాబట్టి కేవలం మొదటి టెస్ట్ లో మాత్రమే పాల్గొని తర్వాత కోహ్లీ తిరిగి భారత్ కు వచ్చేస్తాడు అని బీసీసీఐ వివరించింది. అయితే కోహ్లీ స్థానంలో టెస్ట్ వైస్ కెప్టెన్ అయిన అజింక్య రహానే జట్టుకు న్యాయకతం వహిస్తాడు.

Related posts