బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య యావత్ సినీ ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. ఇక ఆయన మృతికి బాలీవుడ్ ప్రముఖులే కారణమంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఓ రేంజ్ లో జరుగుతోంది. ఇదిలా ఉండగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణాన్ని తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. పదేపదే అతని వీడియోలు చూస్తూ డిప్రెషన్కి గురై సూసైడ్ చేసుకుంది. వైజాగ్ శ్రీహరిపురానికి చెందిన సుమన్ కుమారి ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. సుశాంత్ రాజ్పుత్ మరణంతో కుమారి మానసికంగా కుంగిపోయింది. నిత్యం టిక్టాక్ సుశాంత్ వీడియోలు పదేపదే చూస్తూ డిప్రెషన్కి గురైన కుమారి.. ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్కి చేరుకుని పరిశీలించారు. మొదట అనుమానాస్పద మరణంగా నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ అనంతరం సుశాంత్ మరణాన్ని తట్టుకోలేకే యువతి ఆత్మహత్య చేసుకున్న ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.
previous post