telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ తుగ్లక్ ను మించిన పరిపాలన అందిస్తున్నారు: దేవినేని

devineni on power supply

ఏపీ సీఎం జగన్ తుగ్లక్ ను మించిన పరిపాలనను అందిస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘700 ఏళ్ల క్రితం ఈ దేశం తుగ్గక్ పరిపాలనను చూసింది. ఇప్పుడు జగన్ పిచ్చి తుగ్లక్ లా వ్యవహరిస్తున్నారని అన్నారు. కమిటీని వేసి కమిటీ రిపోర్టులు బయటపెట్టకుండా 27వ తారీఖున కేబినెట్ భేటీ పెడుతున్నారు. విశాఖలో కేబినెట్ మీటింగ్ పెట్టి జీఎన్ రావు కమిటీ నివేదికకు ఆమోదం తెలపాలని భావిస్తున్నారు. 28వ తారీఖున సెక్రటేరియట్ భవనాలను శంకుస్థాపన చేయనున్నారని ఉమ చెప్పారు.

కుట్రపూరితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయాలని చూస్తున్నారు. విజయసాయి రెడ్డి మూడు నెలలుగా పెద్ద ఎత్తున ఆస్తులను కొట్టేశారు. ఈ తుగ్లక్ జగన్ పరిపాలన చూసి పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోతున్నారు. అమరావతి రైతులు త్యాగాలు చేసి భూములు ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం వారికి ప్లాట్లు డెవలప్ చేసి ఇవ్వాలన్నారు. తన ఆస్తులు కాపాడుకోవడానికి జగన్ పార్టీ కక్షతో వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

Related posts