నిలకడైన ఆటతో అరుదైన ఘనతలను అందుకునే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానం బయట కూడా రికార్డులు సృష్టిస్తున్నాడు. కరోనాతో ఈ ఏడాది అంతగా క్రికెట్ మ్యాచ్లు జరగకున్నా.. విరాట్ ఇమేజ్ చెక్కు చెదరలేదు. తాజాగా ట్విటర్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది అత్యధిక మంది లైక్ చేసిన ట్వీట్ విరాట్ కోహ్లీదేనని ట్విటర్ ఇండియా పేర్కొంది.బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ దంపతులు వచ్చే ఏడాది జనవరిలో తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని వారు ఆగస్టులో సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘2021 జనవరిలో మేం ముగ్గురం కాబోతున్నాం ‘ అని గర్భవతి అయిన సతీమణి ఫొటోనూ విరాట్ ట్వీట్ చేశాడు. 2021లో ఈ ట్వీటును ఎక్కువమంది లైక్ చేశారని తాజాగా ట్విటర్ ఇండియా తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రకటించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరిగినప్పుడు దుబాయ్కు వచ్చింది. ఆ తర్వాత అనుష్కా భారత్కు తిరిగి రాగా.. విరాట్ మాత్రం భారత జట్టుతో ఆసీస్కు వెళ్లాడు. ఇక అనుష్క మాత్రం భర్తతో కలిసి తల్లిని కాబోతున్న ఆనందాన్ని ఆస్వాదిస్తోంది. తన ఇన్స్టాగ్రామ్లో మాతృత్వపు మాధుర్యం తాలూకు పోస్టులు పెడుతోంది. విరాట్తో ఉన్న త్రోబ్యాక్ పిక్లను పంచుకుంటుంది. ఇక జనవరిలో అనుష్క డెలివరీ కానుంది. ప్రసవ సమయంలో ఆమెకు అండగా ఉండేందుకు తొలిటెస్టు తర్వాత పెటర్నిటీ లీవ్ మీద విరాట్ భారత్కు రానున్నాడు.
previous post