ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం అంశంపై ఏపీ సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో గత కొద్దిరోజులుగా రాష్ట్ర ప్రజల్లో గందరగోళం నెలకొన్ని నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఆర్డీఏ ఉన్నతాధికారులు హాజరైనారు. రాజధాని అమరావతి నిర్మాణం అంశంపై జగన్ చర్చిస్తున్నట్లు సమాచారం. రాజధాని తరలింపుపై టీడీపీ, వామపక్షాలు, జనసేన పార్టీలు తీవ్రంగా ఖండించాయి.
రాజధానికి భూములిచ్చిన రైతులు కూడా ఆందోళనకు సిద్ధమయ్యారు. బొత్స వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆయన వ్యాఖ్యలపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సీఎం జగన్ రాజధానిపై ప్రకటన చేయాలని రైతులు డిమాండ్ చేశారు.ఈ భేటీలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.