యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని గూడూరు ప్రధాన రహదారిపై వాటర్ ట్యాంకర్ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్కు చెందిన ఏడుగురు స్నేహితులు తెలిసిన వారి పెళ్లి కోసం గురువారం ఉదయం ఆలేరు వచ్చారు. వివాహం పూర్తయ్యాక సాయంత్రం 5 గంటలకు కారులో హైదరాబాద్కు బయలు దేరారు. అయితే… వీరు ప్రయాణిస్తున్న కారు యదాద్రి జిల్లాలోని బీబీనగర్ మండలం గూడూరు వద్దకు చేరుకున్న సమయంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో రోడ్డుపై మొక్కలకు నీరు పోస్తున్న వాటర్ ట్యాంకర్ను వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టంది. ఈ ప్రమాదంలో వెంకటేశ్, రవి కిరణ్, కార్తీక్ రెడ్డి, కల్యాణ్ రెడ్డిలు అక్కడిక్కడే మృతి చెందారు. ఇక ఈ ప్రమాదంలో అఖిల్, సాయిచరణ్, హర్షవర్ధన్లు తీవ్రంగా గాయపడ్డారు. అయితే.. ప్రమాదం జరిగిన వెంటనే ఈ ముగ్గురిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు..కేసు నమోదు చేసుకున్నారు.
previous post