telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

గుడ్‌ న్యూస్‌ : ఏపీలో నేటి నుంచే ఇళ్ల పట్టాల పంపిణీ..!

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో అద్భుత కార్యక్రమానికి ఇవాళ నాంది పలకనుంది. ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించనుంది జగన్‌ ప్రభుత్వం. తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో ఈ పథకానికి సీఎం జగన్‌ శ్రీకారం చుట్టనున్నారు. కోర్టు వివాదలు ఉన్న ప్రాంతాలు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియ అమలు కానుంది. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల పంపిణీ కోసం వేర్వేరు తేదీలను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కోస్తా జిల్లాల్లో ఇవాళ, రాయలసీమకు సంబంధించి ఈ నెల 28న చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో, ఉత్తరాంధ్రకు ఈనెల 30న విజయనగరంలో సీఎం జగన్‌ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. అనంతరం 15 రోజుల పాటు.. మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గా ల్లో ఇళ్ల పట్టాలు అందజేయనున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related posts