telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గ్రామ సచివాలయ పరీక్ష పేపర్ లీక్.. ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

chandrababu

ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గ్రామ వార్డు, సచివాలయం పరీక్ష ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని ఈ రోజు ‘ఆంధ్రజ్యోతి’ దిన పత్రిక లో కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వంపైనిప్పులు చెరిగారు. ఈరోజు గ్రామ సచివాలయ పరీక్ష ప్రశ్నాపత్రాలను లీక్ చేసి భారీ స్కాంకు పాల్పడ్డారని ఆరోపించారు. ఓ అవినీతిపరుడికి అధికారంలో ఇస్తే ఇంకా పెద్ద అవినీతి జరుగుతుందని జగన్ ప్రభుత్వం నిరూపించిందన్నారు.

నిన్నటికి నిన్న గ్రామ వాలంటీర్ పోస్టులన్నింటిని వైసీపీ కార్యకర్తలకు ఇచ్చుకుని నిరుద్యోగులను మోసం చేశారనీ ధ్వజమెత్తారు. నామమాత్రపు ఇంటర్వ్యూలు నిర్వహించి వాళ్ల ఆశలను ఆవిరి చేశారని విమర్శించారు. నిరుద్యోగుల భవితకు ఉరి వేశారని మండిపడ్డారు. ఏంటి తమాషాలా? రాష్ట్రంలో ఏం జరుగుతోంది? మోసపోయిన నిరుద్యోగులకు ఏ రకంగా న్యాయం చేస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలిని చంద్రబాబు వరుస ట్వీట్టర్ లో డిమాండ్ చేశారు.

Related posts