ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీ శకటం లేకుండా చేయడం వివక్షేనని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై నిరసన తెలుపుతూ వెంటనే లేఖ రాయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో చంద్రబాబు మాట్లాడుతూ గణతంత్ర వేడుకల్లో ఏపీ శకటంపై కూడా ప్రధాని మోదీ అక్కసు పెట్టుకున్నారని విమర్శించారు.
కేంద్రం వివక్షతను బహిర్గతం చేయాలని పార్టీ నేతలతో పేర్కొన్నారు. మోదీ హుందాతనం లేకుండా మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ఏపీ పురోగతి చూసి భరించలేక వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఏ రాష్ట్రానికి రానన్ని అవార్డులు ఏపీకి వచ్చాయని, అందుకే మోదీకి అసూయ, అక్కసు పెరిగిపోతోందని వ్యాఖ్యానించారు.