వడ్డీరేట్లపై కేంద్రం ప్రభుత్వం సామన్య ప్రజలకు శుభవార్త చెప్పింది. చిన్న మొత్తాల పొదుపు వడ్డీరేట్లు యథాతథంగా ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పొదుపు పథకాలపై వడ్డీరేట్లను తగ్గిస్తూ.. కేంద్రం బుధవారం నిర్ణయం తీసుకుంది. వడ్డీరేట్లను 1.1 శాతం వరకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న జారీ చేసిన ఉత్వర్వులను ఉపసంహరించుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. 2020-21 చివరి త్రైమాసికం ప్రకారమే వడ్డీరేట్లు ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది.
previous post
సీట్లు పోయినా ఓట్ల శాతం పెరిగింది: కేటీఆర్