ఏపీ రాజధాని అమరావతి అంశంపై సినీ నటుడు సుమన్ స్పందించారు. మాచర్లలో సర్ధార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నటుడు సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతి ప్రాంత రైతులు వారికి ఏం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవాలని సూచించారు.
రైతులు సినీ పరిశ్రమను కోరితే ‘మా’మూవీ అసోసియేషన్ తరఫున తప్పకుండా తమ వంతు సహకారం అందిస్తామన్నారు. రాజధాని అమరావతిలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై స్పందించారు. మూడు రాజధానుల విషయంలో సీఎం అసలు ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదన్నారు. సీఎం జగన్ను కలవడానికి ఐదుసార్లు ప్రయత్నించినా తమకు అనుమతి లభించలేదన్నారు.