రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి జరగాల్సిన డీఎడ్ మొదటి సంవత్సరం పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఒకవైపు కరోనా ఉద్ధృతి కొనసాగుతుండటం, మరోవైపు భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేసింది.
ఈ పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటికే ప్రతి రోజు 7 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు ఆరున్నర లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. దాదాపు 5,600 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు.
తూతూ మంత్రంగానే రివర్స్ టెండరింగ్: సుజనా చౌదరి