తిరుమల ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. శ్రీవారి ఆలయంలో సోమవారం వేకువజామున వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమై మంగళవారం అర్ధరాత్రి ఏకాంతసేవ వరకు(48 గంటల పాటు) కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి 11 గంటలకే ఏకాంతసేవ నిర్వహిస్తారు. అర్ధరాత్రి 12.30 గంటలకు తిరిగి ఆలయం తెరిచి తిరుప్పావై పాశురం పఠించాక దక్షిణ, ఉత్తర భాగంలోని వైకుంఠ ద్వారాలను శాస్త్రోక్తంగా తెరుస్తారు.
ఈ సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే భక్తులను నేటి ఉదయం నుంచి క్యూ లైన్లలోకి అనుమతించనున్నారు. లక్ష మంది భక్తులు క్యూ లైన్లు, షెడ్లలో వేచి ఉండేలా ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అధికారులు చెప్పారు. సోమవారం ఉదయం ఒంటి గంటకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుంది. నాలుగు గంటల పాటు విఐపిలను దర్శనానికి అనుమతించనుండగా, ఉదయం 5 గంటల నుంచి ఎల్లుండి(మంగళవారం) వైకుంఠ ద్వారాలను మూసేవరకు సర్వదర్శనం ద్వారా మహాలఘులో భక్తులను అనుమతించనున్నారు. మరోవైపు శ్రీవాణి ట్రస్ట్ కింద 5వేల టిక్కెట్లను టీటీడీ జారీ చేసింది. వీరిని సోమవారం ఉదయం 10 గంటలకు దర్శనానికి అనుమతించనున్నారు. కాగా, ఈ ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని అర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
మరో సావిత్రిలా తయారయ్యేదాన్ని… సిద్ధార్థ్ తో గురించి సమంత సంచలన వ్యాఖ్యలు