telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వరంగల్ కార్పొరేషన్ లో కరోనా కల్లోలం : కొత్తగా గెలిచిన 8 మంది పాజిటివ్..

వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన కార్పొరేటర్లతో జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పరిశీలకులుగా వచ్చిన మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్పీలు హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్ కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ..ఈ ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన వారిలో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. ఈ విషయం చాలా బాధాకరమన్నారు. గెలుపోందిన వారు వీడియో కాల్ ద్వారా ప్రమాణ స్వీకారంతో పాటు, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో పాల్గొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే జరుగుతుందని.. కొన్ని సమీకరణాలు దృష్ట్యా పార్టీ నిర్ణయం ఉంటుందని తెలిపారు. పార్టీ నిర్ణయాన్ని కాదని విప్ దిక్కరిస్తే క్రమ శిక్షణా చర్యలు ఉంటాయన్నారు. ..

Related posts