తెలుగులో పాయల్ రాజ్పుత్ నటించిన చిత్రాల సంఖ్య తక్కువే. కానీ, ఎక్కువమంది ప్రేక్షకులకు ఆమె తెలుసు. తొలి తెలుగు చిత్రం ‘ఆర్ఎక్స్ 100’, తర్వాత ‘ఆర్డిఎక్స్ లవ్’ తో గ్లామర్ నాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ చిత్రాల్లో నటనకు ఆస్కారమున్న పాత్రలు చేసినప్పటికీ, పాయల్ రాజ్పుత్ను గ్లామర్ భామగా మెజారిటీ ప్రేక్షకులు చూస్తున్నారు. అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’లో, అలాగే శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘ఇండియన్ 2’లో పాయల్ ఐటెం సాంగ్స్ చేస్తోందని చెప్పు కుంటున్నారు. ఇది ఇలా ఉండగా తాజాగా ఈ భామ చాలా ఎమోషనల్ అయింది. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఎంతగానో లవ్ చేసే అనితా ఆంటీ కరోనా సోకి మృతి చెందినట్లు పేర్కొంది. ఇకపై మీరు నా పక్కన ఉండకపోవచ్చు.. కానీ నా గుండెల్లో ఎప్పటికీ ఉంటారని ఎమోషనల్ అయింది.
previous post