మంత్రి పదవుల కోసం ఆశ పెట్టుకొన్న టీఆర్ఎస్ ఎమ్మేల్యేలు బెర్తులు దక్కకపోవడంతో తమ నిరసనగళాన్ని విన్పిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న సోమవారం రాత్రి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో జోగు రామన్న భార్య రమ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తన భర్తకు మంత్రి పదవి రాకపోవడం బాధగా ఉందని అన్నారు. మంత్రి పదవి రాకపోవడంతో తన భర్తకు బీపీ ఎక్కువైందన్నారు. తన భర్త అజ్ఞాతంలోకి వెళ్లడం చాలా బాధ కల్గించందన్నారు.
అధిష్టానం ఆదేశాల మేరకు తాము నడుచుకొంటామని ఆమె చెప్పారు. 2014 నుండి 2018 వరకు కేసీఆర్ మంత్రివర్గంలో జోగు రామన్న అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. ఈ దఫా కేసీఆర్ మంత్రివర్గంలో జోగు రామన్నకు మంత్రి పదవి దక్కలేదు.దీంతోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఆయన కుటుంబసభ్యులకు టచ్లోకి వచ్చినట్టు సమాచారం. అనారోగ్యం కారణంగానే తాను కార్యకర్తలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని చెప్పారని సమాచారం.