ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా భారీనపడ్డ విషయం తెలిసిందే. తాజాగా టీడీపీ నేత బుద్ధా వెంకన్న కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు. కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో వైద్యుల సూచనల మేరకు ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. కొన్ని రోజుల పాటు తాను రాజకీయాలకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు.
‘నాకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. 14 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండమని డాక్టర్ సూచించారు. ఈ 14 రోజులు రాజకీయాలకు దూరంగా ఉంటాను. నాకు దైవ సమానులైన మా అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో కోలుకొని త్వరలోనే తిరిగి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటాను’ అని తెలిపారు.