telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జీఎన్ రావు నివేదికపై స్పందించిన గల్లా జయదేవ్

galla jayadev got new responsibilities

రాజధాని మార్పు పై ఏపీ ప్రభుత్వం జీఎన్ రావు కమిటీనీ నియమించింది. విశాఖ నగరానికి తుపానుల ముప్పు ఉందని బీసీజీ కమిటీ నివేదికల్లో స్పష్టంగా పేర్కొన్నారంటూ మీడియాలో వచ్చిన కథనాలపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు. విశాఖకు వరదలు, సముద్రపు నీటి మట్టం పెరుగుదల, పారిశ్రామిక కాలుష్యం, ఈస్ట్రన్ నావల్ కమాండ్ ఉండడంతో భద్రతాపరమైన ముప్పు ఉన్నట్టు జీవన్ రావు కమిటీ నివేదికలో పేర్కొన్నారని తెలిపారు.

విశాఖలో అవన్నీ ఉండడం వల్లే జీఎన్ రావు కమిటీని ప్రజలకు వెల్లడించలేదంటూ జయదేవ్ ట్విట్టర్ లో ప్రశ్నించారు.అంతేగాకుండా, ఇక్కడ కొత్తగా ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ వాంఛనీయం కాదని, అభివృద్ధి కోణంలో విశాఖకు ఆ అవసరమే లేదని కమిటీ పేర్కొందని గల్లా వివరించారు.

Related posts