హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో ఓ సినీ నిర్మాత గాయాలపాలయ్యారు. బాలకృష్ణ ప్రచారంలో పాల్గొనడానికి సహ నిర్మాత కొమ్మినేని వెంకటేశ్వర్లు హిందూపురం వచ్చారు. ప్రచార సమయంలో ఆయన ప్రమాదవశాత్తు ఆయన గాయాలపాలయ్యారు. చిలమత్తూరు మండలం మడంపల్లి వద్ద ప్రచారంలో ఉన్న బాలకృష్ణ వద్దకు వెళ్లేందుకు ప్రచార రథం ఎక్కేందుకు ప్రయత్నించాడు. వాహనం ముందుకు కదలడంతో కాలు జారి కిందపడ్డాడు. దీంతో అతని ఎడమ చేతికి గాయాలు కావడంతో హిందూపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయనకు శస్త్రచికిత్స చేయాలని వైద్యులు తెలిపారు.