telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

చర్మ క్యాన్సర్‌ కు ఈ పండ్లతో చెక్ పెట్టండి !

ఏ సీజన్‌లో దొరికే పండ్లు ఆ సీజన్‌లో తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అలా ఇప్పుడు మార్కెట్లో విరివిగా దొరుకుతున్న పండ్లలో ద్రాక్ష ముందు వరుసలో ఉంటుంది. ద్రాక్ష పండ్లు తింటే సూర్యరశ్మిలోని అతినీల లోహిత కిరణాల వల్ల ఉత్పన్నం అయ్యే సమస్యలు తగ్గుతాయట. ఇదే విషయాన్ని అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ డెర్మటాలజీ పరిశోధకులు అధ్యయనం చేసి మరీ తేల్చి చెప్పారు. నిత్యం ద్రాక్ష పండ్లు తినేవారిలో ఎండకు చర్మం కమిలిపోకుండా ఉంటుందని కూడా ఈ అధ్యయనంలో వెల్లడైంది. దీనికి కారణం ద్రాక్షలోని పాలీ ఫెనాల్స్‌ వంటి పదార్థాలే. సీజన్‌ ఉన్నన్ని రోజులూ ద్రాక్ష పండ్లు తినాలని, అలా చేస్తే యూవీ కిరణాల వల్ల కలిగే సమస్యలు 74.8 శాతం మేర తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ద్రాక్ష మన డీఎన్‌ఏకి నష్టం వాటిల్లకుండా రక్షిస్తుంది. చర్మ క్యాన్సర్‌ను సైతం అడ్డుకుంటుందని తెలిపపే అధ్యయనాలు కూడా ఉన్నాయి. ఎండాకాలం డీ హైడ్రేషన్‌ సమస్య నుంచీ బయటపడవచ్చు.

Related posts