తాజా సమాచారం ప్రకారం ప్రభాస్, యశ్లు బాక్సాఫీస్ వద్ద తలపడేందుకు రెడీ అవుతున్నారంట. యశ్ హీరోగా తెరకెక్కుతున్న కేజీఎఫ్2 సినిమా ఈ ఏడాది జులై16న విడుదల కానుంది. అయితే ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాను జులై30న రిలీజ్ చేయాలని సినిమా మేకర్స్ ఆలోచిస్తున్నారంట. అంటే కేజీఎప్2 విడులయిన రెండు వారాలకే రాధేశ్యామ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే కేజేఎఫ్2 చేసే వసూళ్లు రెండు వారాలతో ఆగేవి కాదు, దాంతో బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు తప్పక తలపడతాయి. బాక్సాఫీస్ వద్ద ఇద్దరు స్టార్ హీరోలు తలపడితేనే చిన్నపాటి యుద్దంలా ఉంటుంది. అటువంటిది ఇక ఇద్దరు పాన్ ఇండియా స్టార్లు తలపడితే ఎలా ఉంటుందో ఊహకు కూడా అందడంలేదు. అయితే రాధేశ్యామ్ సినిమా దాదాపు పోస్ట్ప్రొడక్షన్ పని ముగించుకుంది. దాంతో ఈ సినిమా విడుదలను ఏ మాత్రం ఆలస్యం చేయకూడదని మేకర్స్ అనుకుంటున్నారు. అందుకనే జులైలో రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారంట. అంతేకాకుండా ఈ సినిమా రిలీజ్ డేట్ను టీజర్తో పాటు విడుదల చేయనున్నట్లు తెలిపారు. టీజర్ ఫిబ్రవరి14న విడుదల కానుంది. మరి రాధేశ్యామ్ సినిమాతో ప్రభాస్ కేజీఎప్2తో పోటీ పడతాడా లేదా తప్పుకొని వేరే తారీకు చూసుకుంటాడా అనేది చూడాలి.
previous post
next post
మాజీభర్త పెళ్లిపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్