తెలంగాణ గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రజలకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. 2020 సంవత్సరం తెలంగాణ ప్రజలందరికీ సుఖ శాంతులు కలిగించాలని ఆకాక్షించారు. ప్రజలు నూతనోత్సాహంతో ముందుకు సాగాలని అన్నారు. రాజ్ భవన్ కు వచ్చిన ప్రజలతో కలవడం చాలా సంతోషం కలిగించిందన్నారు.
తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టి వంద రోజులు పూర్తయ్యాయని తమిళిసై తెలిపారు. ఇటీవల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాజ్భవన్లో బ్లడ్ డొనేషన్ యాప్ విడుదల చేశారని, రాజ్భవన్ ఆధ్వర్యంలో దానిపై పర్యవేక్షణ జరుగుతుందన్నారు. బోడగూడెం అనే ట్రైబల్ గ్రామానికి చెందిన కొంతమంది తనను కలిసి వాళ్ళ సమస్యలు వివరించారన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.
మోదీ మళ్లీ ప్రధాని అయితే ఏం చేస్తారోనని భయం: శరద్ పవార్